Friday, May 17, 2024

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు..

తప్పక చదవండి

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరుగనుంది. అన్నమయ్య భవనంలో జరిగే సమావేశానికి టీటీడీ పాలకవర్గం సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్‌ పనులు, కొనుగోళ్లు, భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నామని అధికారులు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు