Friday, May 3, 2024

పాఠశాలలో ఉపాధ్యాయులు కరువయ్యారు

తప్పక చదవండి

బీడీబీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు

గజ్వేల్‌ : పాఠశాలలో ఉపాధ్యాయులుకరువయ్యారు అనిడిబిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శివేణుఅన్నారు. బుధవారం గజ్వేల్‌ మండలం సంగాపూర్‌ లోని మండల పరిషత్‌ ప్రైమరీ స్కూల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని డిబిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ111 పదిమంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడం, అందులో హెడ్మాస్టర్‌ పది రోజుల నుంచి స్కూలుకి రాకపోవడంతో బడికి వచ్చి చదవాల్సిన పిల్లలు రోజంతా ఆట పాటలతో రోజంతా గడిచిపోతుందని మండిపడ్డారు,గజ్వేల్‌ కి అడుగు దూరంలోనే ఉన్న స్కూల్లో పరిస్థితి ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎట్లుందో తెలుస్తుందన్నారు,కొత్త పథకాల పేరుతో వేలకోట్లు వృధా చేస్తున్న ప్రభుత్వం బడుల మీద శ్రద్ధ పెట్టాలని అన్నారు, వెంటనే సంగాపూర్‌ స్కూల్‌ కి పిల్లలకు సరిపడే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు