Saturday, July 27, 2024

టెట్‌తోపాటు టిఆర్టి షెడ్యూల్‌ ఇవ్వాలి

తప్పక చదవండి

ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్‌) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 జూన్‌ లో మొదటిసారి, 2012 జనవరిలో రెండవసారి, 2012 మే నెలలో 3వ సారి టెట్‌?పరీక్ష జరిగింది. 2012 ఆగస్టులో 21 వేల టీచర్‌ పోస్టులకు అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. ఆ తర్వాతి ఏడాది 2013 సెప్టెంబర్‌ లో 4 వ టెట్‌ నోటిఫికేషన్‌ తోపాటే, 20 వేల పోస్టులకు డీఎస్సీ తేదీలను వెల్లడిరచింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో డీఎస్సీ రద్దు అయింది. 2014 మార్చి16 న 4వ టెట్‌ జరిగింది.
స్వరాష్ట్రంలో పరీక్షలు.. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చాలా తక్కువ సంఖ్యలో జరిగాయి. ప్రభుత్వం టెట్‌?పరీక్షలు పెడుతూ కాలయా జన చేస్తున్నది. 2016 మే 22న తెలంగాణ తొలి టెట్‌ జరిగింది. 2017 జులై 23న రెండోది నిర్వహించిన సర్కారు.. అదే ఏడాది అక్టోబర్‌ 22 న 8,792 పోస్టులకు టీఆర్టి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదిగో ఎగ్జామ్‌, ఇదిగో రిక్రూట్‌మెంట్‌అంటూ వాయి దాలు వేస్తూ రావడంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఆదేశాలు ఇచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో రిక్రూట్‌మెంట్‌చేసింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌సర్కారు. దాదాపు నాలుగేండ్లపాటు టెట్‌, డీఎస్సీ, టీఆర్టీ ఊసే ఎత్తలేదు. చివరకు 2022 జూన్‌ 12 న టెట్‌ పరీక్ష నిర్వహించింది. అయినా ఇంతవరకు టీచర్‌ పోస్టులకు నోటిఫికే షన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ టెట్‌ తాజాగా మంత్రివర్గ ఉపసం ఘం నిర్ణయం ప్రకారం ప్రభుత్వం త్వరలో మరో టెట్‌ నిర్వహం చబోతున్నది. టెట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దానికి కూడా క్యాబినెట్‌సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని, టెట్‌ ప్రకటన ఇచ్చి ఏదో భారీస్థాయిలో ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ అన్నట్లు ప్రభుత్వం ఆర్బాటంగా చెబుతున్నది. టెట్‌ వ్యాలిడిటీ లైఫ్‌ టైమ్‌ కాబట్టి.. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 4 టెట్లు, తెలం గాణలో 3 టెట్లు కలిపి ఇప్పటి వరకు 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఆశగా చూస్తున్నారు. మరో 2 లక్షల మంది అభ్యర్థులు టెట్‌లో పాస్‌ కాని వారు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చే అవ కాశం ఉంది. కాబట్టి టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్‌ ప్రక్రియ పూర్తి అయి నా, కాకున్నా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి, ఎన్నికల కోడ్‌ లోపే టీఆర్టీ లేదా డీఎస్సీ నోటిఫికే షన్‌ జారీ చేయాలని 4 లక్షల మంది అభ్యర్థులు కోరుతు న్నారు. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో ఉన్న 10 నుంచి12 వేల టీచర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేది. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈతొమ్మిదేండ్లలో ఒకే ఒక్క డీఎస్సీ(టీఆర్టీ 2017) జారీ చేశారు. స్కూళ్లలో టీచర్లు లేక.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు లేక.. బోధన కుంటుపడు తున్నది. టెన్త్‌లాంటి పైస్థాయి ల్లోనూ సబ్జెక్ట్‌ టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది. గతంలో ఖాళీ పోస్టు ల్లో బోధిం చిన విద్యా వలంటీర్లను కూడాప్రభుత్వం తొలగించింది. దీంతో సదువు చెప్పే సార్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతు న్నారు. లక్షలాది మంది అభ్యర్థులు, నిరుద్యోగుల ఇబ్బందులు తీర్చడంతో పాటు సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థుల భవిష్య త్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలయాపన చేయ కుండా వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికే షన్‌ జారీ చేయాలి.
` రావుల రామ్మోహన్‌రెడ్డి, బీఎడ్‌, డీఎడ్‌అభ్యర్థుల సంఘం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు