Wednesday, May 15, 2024

లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య..

తప్పక చదవండి
  • కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు..
  • యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజస్విని
  • ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి
  • మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్ ప్రాంతం..

లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజస్విని రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో తెలుగు అమ్మాయి అఖిల తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్‌ చంపాపేటకు చెందిన తేజస్విని ఉన్నత చదువుల కోసం లండన్ వెల్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు తేజస్వినితో పాటు అఖిల అనే మరో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ? ఎందుకు ఇద్దరమ్మాయిలపై దాడి చేశాడు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశ్విని మృతి చెందినట్లుగా లండన్ అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు