Saturday, July 27, 2024

యాదవుల సంక్షేమం కోసం ఐకమత్యం తో ముందుకు సాగుదాం..

తప్పక చదవండి
  • పిలుపునిచ్చిన పోచబోయిన శ్రీహరి యాదవ్..

కొమురవెల్లి కేంద్రంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కొమురెల్లి, చేర్యాల, దూల్ మిట్ట మండలాల ముఖ్యనాయకుల సమావేశంలో ముఖ్య అతిధిగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవ జాతిసంక్షేమం కోసం ఐకమత్యం గా ప్రతి ఒక్క యాదవ్ ముందుకు రావాలని.. ఆర్థిక అభివృద్ధి కోసం.. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూనే రానున్న ఎన్నికల్లో రాజకీయంగా ఎదగడం కోసం పెద్ద ఎత్తున శక్తి ప్రదర్శనకు సిద్ధంకావాలన్నారు.. చట్ట సభలలో ఇప్పుడున్న సంఖ్యను రెట్టింపు చేసుకోవడానికి చైతన్యంతో ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.. అనంతరం మూడు మండలాల కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది.. కొమురవెల్లి ఎక్కలదేవి కనుకరాజ్ యాదవ్, చేర్యాల దాసరి కనుకయ్య యాదవ్, దూల్ మిట్ట సిర్రబోయిన తిరుపతి యాదవ్ లతో పాటు కార్యవర్గంను ప్రతి మండలం నుండి ఇద్దరు చొప్పున జిల్లా కమిటీలోకి తీసుకోవడంజరిగింది.. ఇంకా ఈ కార్యక్రమంలో ఏంబారి రాంచంద్రం యాదవ్, పయ్యావుల రాములు యాదవ్, బొద్దుల కనుకయ్య యాదవ్, పాతుకుల వెంకటేష్ యాదవ్, పర్వతాలు యాదవ్, గందమల కనుకయ్య యాదవ్, చీపురు మల్లేష్ యాదవ్, యువత జిల్లా అధ్యక్షులు బొల్లు రాము యాదవ్ లు మాట్లాడారు.. ఇంకా ఈ కార్యక్రమంలో ఎద్దు యాదగిరి యాదవ్, పయ్యావుల ఎల్లం యాదవ్, దాసరి శ్రీనివాస్ యాదవ్, తెలుజీరు శ్రీనివాస్ యాదవ్, జక్కుల బాలమల్లు యాదవ్, ఐతంరాజు యాదవ్, అర్జున్ యాదవ్, చింతల కుమార్ యాదవ్, రాజబోయిన కొమురయ్య, పత్తి వెంకటేష్ యాదవ్, యాంజాల ఐలయ్య యాదవ్, బొల్లు తిరుపతి యాదవ్, గొల్ల రాజు యాదవ్, సిద్దరబోయిన శ్రీనివాస్ యాదవ్, కాటుక నర్సింలు యాదవ్, సందెబోయిన నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు