Friday, April 26, 2024

కేసీఆర్ దోపిడీని ఇంకెంత కాలం భరించాలి..?

తప్పక చదవండి
  • న్యూజెర్సీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి ధ్వజం..
  • తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు..
  • 9 ఏళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశాడు కేసీఆర్..
  • తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం : రేవంత్.
    న్యూ జెర్సీ : న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం… తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించి పోరాటాలు, త్యాగాలు చేసి రాష్టాన్ని ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. అయితే ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాజకీయాలను అవినీతిమయం చేశారని మండిపడ్డారు. ఇక్కడ అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, అందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

తెలంగాణలో 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ.17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చిందని.. రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేశామంటూ చెప్పిన టీఆర్ఎస్‌కు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. కానీ కేసీఆర్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన చెయ్యలేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు