- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యస్. వెంకట్రావ్
సూర్యాపేట ప్రతినిధి: పోలింగ్ కేంద్రాల క్రమ బద్దీకరణ వేగంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ యస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పోలింగ్ కేంద్రాల క్రమ బద్దీకరణ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజక వర్గాల వారీగా వివిధ అంశాలపై సమీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పేర్ల మార్పు అలాగే పాత పోలింగ్ కేంద్రాల మార్పు ల పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏమైనా తమ అబ్యఅంతరాలు ఉంటే తెలియచేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనకు టీమ్స్ పంపించి వాటి యొక్క స్టితిగతుల పై సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని , ఓటర్ సవరణ జాబితా పూర్తి స్థాయిలో ఉండేలా కృషి చేస్తున్నామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ ఏ.వెంకట రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వరరావు, సి.పి.యం నుండి కోటా గోపి, బి.ఆర్.ఎస్ నుండి దేవర శెట్టి సత్యనారాయణ, బి.యస్.పి నుండి స్టాలిన్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-