- ఎంత చెప్పినా పట్టించుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి..
- వారం రోజులుగా మొరపెట్టుకున్నా కన్నెత్తిచూడని దౌర్బాగ్యం..
- పలు మండల గ్రూపులలో అధికారులు జీపీలో పనులు చేయిస్తునట్టు
ఫోటోలు పెడుతున్నారు. కానీ బోజేర్వు గ్రామంలో మాత్రం పరిస్థితి దారుణంగా
ఉంది. ఊరు చెరువులా మారింది.. వంట సామాగ్రి తడిసి ముద్దైంది
చెన్నారావుపేట : మండల పరిధిలోని బోజేర్వు గ్రామపంచాతీలో పారిశుద్ధ్యం పనుల నిర్వహణపై అధికారులు జాప్యం చేస్తున్నారు.గ్రామ ప్రజలు పలుమార్లు చెప్పిన సైడ్ కాలువల్లో మట్టి తీయించలేకపోవడం తో మునిగిన ఇండ్లు వంట సామాగ్రి మొత్తం ధ్వంసం పారిశుద్ధ్య నిర్వహించడం లేదు.గ్రామ సైడ్ డ్రైనేజీల్లో మట్టి నిండిపోయి నీరు ఏరులై పారుతున్న గ్రామపంచాయతీ ప్రజలు పలుమార్లు విన్నవించిన,అర్జీ పెట్టుకున్న కాల్వలో ఉన్న మట్టి తీయించని దుస్థితి ఏర్పడిరదని గ్రామవాసులు అన్నారు.మట్టి తీయకపోవడంతో అనేక రోగాల బారిన పడి ఆస్పత్రిల చుట్టూ తిరగడం జరుగుతుందని అన్నారు.అధికారులు వెంటనే స్పందించి మట్టి తీయించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజానీకం…
తప్పక చదవండి
-Advertisement-