Sunday, April 28, 2024

రూ. లక్ష సాయంవెనుకబడిన వర్గాల వారికి గుడ్ న్యూస్..

తప్పక చదవండి
  • చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత..
  • ప్రారంభమైన అధికారిక వెబ్‌సైట్..
  • ఈ నెల 9న పథకం ప్రారంభించనున్న కేసీఆర్..
  • దరఖాస్తుకు ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ అవసరం..

హైదరాబాద్,తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కేసీఆర్ సర్కార్.. రాష్ట్రంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకుంటూ వెనుకబడిపోయిన వారికి చేయూతను అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది సర్కార్.. ఆ సాయం పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. అయితే.. ఆ అధికారిక వెబ్‌సైట్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం విశ్వ బ్రహ్మణులు, నాయి బ్రహ్మణులు, రజకులు, కుమ్మరి, మేదరి కులాల వాళ్లు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. వెబ్‌సైట్‌‌ను మంత్రి మంగళవారం రోజు ప్రారంభించగా.. పథకాన్ని మాత్రం సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదో తారీఖున ప్రారంభించనున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వాళ్లు లక్ష రూపాయల సహాయం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అప్లై చేసుకునే వాళ్లకు.. ఓ ఫోటోతో పాటు ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా వివరాలు అవసరముంటుంది. కాగా.. వెబ్‌సైట్‌లో 38 కాలమ్‌ల‌తో చాలా సింపుల్‌గా అప్లికేష‌న్‌ను నింపవచ్చు.. అయితే.. ఈ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకున్న అర్హులకు కులవృత్తులు, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయాన్ని సర్కార్ అందించ‌నున్నారు. అయితే.. లబ్ధిదారుడు ఏ వృత్తికి సంబంధించినవాడు.. ప్రభుత్వ సాయంతో ఏం చేయాలనుకుంటున్నాడు.. లాంటి వివరాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.

- Advertisement -

ఈ నెల తొమ్మిదో తారీఖున ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తే.. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. అయితే.. ఇప్పటికే రైతులకు రైతు బంధు, దళితులకు దళితబంధు లాంటి పథకాలతో అండగా నిలుస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు చేతివృత్తులు, కులవృత్తులు చేసుకుంటూ వెనుకబెడిపోయిన వాళ్లకు కూడా అండగా ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా.. చేతివృత్తుల వారికి ఎంతో కొంత చేయూత అంది.. పనిముట్లు, ముడిసరుకులు కొనుక్కుని.. తమ వృత్తిలో మరింత అభివృద్ధి చెందుతారన్నది ప్రాధాన ఉద్దేశం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు