Wednesday, May 15, 2024

ప్రచారకమిటీ కోకన్వీనర్ గా పొంగులేటి నియామకం హర్షణీయం

తప్పక చదవండి
  • వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతాం

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి టీపీసీసీలో చోటు కల్పించి ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా పదవి బాధ్యతలు ఇవ్వడం శుభ పరిణామమని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాల్ రావ్, టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు అన్నారు. పొంగులేటికి ప్రచార కమిటీలో పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులతో కలసి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జై కాంగ్రెస్, జై పొంగులేటి నినాదాలు చేస్తూ బాణసంచాలను పేల్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, ఎర్రంశెట్టి ముత్తయ్య, దేవరగట్ల ప్రసాద్, చింతలపూడి శేఖర్, గోరేబాబు, దుర్గారావు, సత్యనారాయణ రెడ్డి, గౌస్, పూనం శీను, ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు