Saturday, July 27, 2024

స్టూడెంట్స్ కి నోట్ బుక్స్ అందించిన శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్..

తప్పక చదవండి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినిలకు చదువు యొక్క ప్రాధాన్యతను తెలియ చేస్తూ గురువారం రోజు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి నోట్ బుక్స్ ని, యూకేజీ చిన్నారులకు, ఉన్నత తరగతి విద్యార్థులకు అందచేశారు. చదువుపై శ్రద్ధ ఉన్న విద్యార్థులకు తమ వంతు చేయూత తప్పక ఇస్తామని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుపై దృష్టి పెడుతున్నామని, ఇప్పటి వరకు మూడు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 500 పుస్తకాలు వితరణ చేసినట్లు సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యా రాణి అన్నారు. సీల్ వెల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వందన శర్మ, మంజుల, రమణ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు