వెస్టిండీస్పై తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆ స్థానంలో భారత జట్టు ఉండేది కొన్ని రోజులే. ఒకవేళ రెండో టెస్టులోనూ గెలిచినా ఫస్ట్ ర్యాంక్ కోల్పోయే అవకాశం ఉంది. అదెలాగంటే..? ప్రస్తుతం భారత్ 121 రేటింగ్స్తో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా 116 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే.. యాషెస్ సిరీస్ లో ఇంకా రెండు టెస్టులు ఉన్నందున కంగారు జట్టు భారత్ను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. చివరి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ను ఓడిస్తే ఆసీస్ మళ్లీ నంబర్ 1 ర్యాంక్ దక్కించుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం.