Monday, April 29, 2024

నో కాంప్రమైజ్ అంటున్న మెగాస్టార్..

తప్పక చదవండి

వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కంటే ఎక్కువగా అలసిపోతున్నాడు చిరంజీవి. ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే పూర్తయ్యే వరకు బ్రేక్ తీసుకోవడం మెగాస్టార్‌కు అలవాటు లేదు. ఈయనది మొత్తం ఓల్డ్ స్కూల్. ఒకసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే అంటాడు. వీలైనంత తక్కువ పని రోజుల్లో సినిమా పూర్తి చేస్తే.. నిర్మాతలకు కూడా మేలు జరుగుతుందని ఆలోచించే హీరోలలో చిరంజీవి అందరికంటే ముందుంటాడు. అందుకే ఒక్కో సినిమా కోసం ఆరు నెలలకు మించి టైం తీసుకోవడం లేదు మెగాస్టార్. కరోనా టైం పక్కన పెడితే.. లాస్ట్ ఇయర్ ఆచార్య వచ్చినప్పటి నుంచి చిరంజీవి స్పీడ్‌ చూసి కుర్ర హీరోలు కూడా కుళ్లుకుంటున్నారు. 2022 సమ్మర్‌లో ఆచార్యతో వచ్చిన చిరంజీవి.. దసరాకు గాడ్ ఫాదర్, సంక్రాంతి వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 11న భోళాశంకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడమే కాదు.. తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు మెగాస్టార్. దాంతో మెహర్ రమేశ్‌ సినిమాతో పూర్తిగా రుణం తీర్చుకున్నాడు చిరంజీవి. అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దాని కోసమే వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు మెగాస్టార్. దాదాపు నెల రోజుల న్యూయార్క్ ట్రిప్‌ వెళ్లాడు. ఆగస్టు మొదటి వారంలో మెగాస్టార్‌ ఇండియాకు రానున్నాడు. వచ్చీ రాగానే కళ్యాణ్ కృష్ణ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ లాక్ అయింది. ఆగస్టు మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు చిరంజీవి.

ప్రతి సినిమా పూర్తి అయిన వెంటనే వెకేషన్ వెళ్లడం చిరంజీవికి అలవాటు. అప్పట్లో సైరా తర్వాత ఫ్యామిలీతో పాటు ఫారెన్ టూర్ వెళ్లాడు. అలాగే ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల షూటింగ్ పూర్తి అయిన తర్వాత నెల రోజులకు పైగా బ్రేక్ తీసుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. మూడు నెలలుగా భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న ఈయన.. ఇప్పుడు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. హాలీడే ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే కేవలం 4 నెలల్లో కళ్యాణ్ కృష్ణ సినిమా పూర్తి చేసి సంక్రాంతికి తీసుకురావాలి అనేది మెగాస్టార్ ప్లాన్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించబోతుంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల మరో జంటగా నటించబోతున్నారు. యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు