Thursday, May 9, 2024

పెళ్లైన మరునాడే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు..

తప్పక చదవండి

పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రేటర్‌ నోయిడాలోని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సికింద్రాబాద్‌కు చెందిన మహిళతో ఈ నెల 26న పెళ్లి జరిగింది. అయితే వివాహం జరిగిన మరునాడు రాత్రి కడుపులో నొప్పిగా ఉందని నవ వధువు చెప్పింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు, నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని చెప్పారు. ఈ విషయం తెలిసి నవ వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు.. కాగా, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన ఆ మహిళ తర్వాత రోజు పాపకు జన్మనిచ్చింది. ఆమె గర్భవతి అన్న సంగతి తమకు తెలుసని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు చెప్పారు. అయితే వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా వధువు కుటుంబం తమకు చెప్పిందని వరుడి బంధువులు ఆరోపించారు. నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని డాక్టర్లు చెప్పడంతో తాము షాకైనట్లు తెలిపారు.

మరోవైపు ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించాయి. నవ వధువు, ఆమె జన్మనిచ్చిన పాపను వరుడి కుటుంబం నిరాకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని తీసుకుని సికింద్రాబాద్‌కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు