Friday, May 17, 2024

పంజాబ్ లో మిలిటరీ కాంటీన్లో మెస్ వర్కర్ దాడి … పోలీస్ అధికారికి గాయాలు..

తప్పక చదవండి

మెస్ వ‌ర్క‌ర్ దాడిలో ఎయిర్ ఫోర్స్ అధికారికి గాయాలు పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ మిల‌ట‌రీ బేస్‌లో క్యాంటిన్ వ‌ర్క‌ర్ దాడి చేయ‌డంతో ఎయిర్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) అధికారి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
చండీఘ‌ఢ్ : పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ మిల‌ట‌రీ బేస్‌లో క్యాంటిన్ వ‌ర్క‌ర్ దాడి చేయ‌డంతో ఎయిర్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) అధికారి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌ఠాన్‌కోట్ ఆర్మీ బేస్‌లో బాధిత అధికారిణి స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
క్యాంటిన్ కార్మికుడు ఆమెపై ప‌దునైన ఆయుధంతో దాడి చేయ‌గా త‌ల‌పై తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం బాధితురాలిని చండీఘ‌ఢ్ త‌ర‌లించిన‌ట్టు అధికారులు తెలిపారు. ఘ‌ట‌న స‌మాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి మెస్ వ‌ర్క‌ర్‌ను అరెస్ట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు వేగవంతం చేశారని డీసీపీ ల‌ఖ్వింద‌ర్ సింగ్ వెల్ల‌డించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు