Saturday, July 27, 2024

మీరే నా బ‌లం : మంత్రి హరీష్ రావు

తప్పక చదవండి

మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో మంత్రి హ‌రీశ్‌రావు గురువారం ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ధి కార్యక్రమాలకు జ‌డ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడారు. మల్యాల గ్రామానికి గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ఎటు వైపున చూసినా గ్రామ రూపురేఖలు మారిపోయాయని, గల్లీ, గల్లీలో సీసీరోడ్లు వేసుకున్నామని తెలిపారు. మరో వారం రోజుల్లో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని హ‌రీశ్‌రావు తెలిపారు. పుట్టబోయే బిడ్డకు న్యూట్రిషన్ కిట్. పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్. ఇది కేసీఆర్‌కు ప్రజల మీద ఉన్న ప్రేమగా మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయ్యాక అవ్వ, తాతల గౌరవం పెరిగింది అని హ‌రీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అంటూ.. గత గ్రామ అనుభవాలు గుర్తు చేసి, ఇవాళ జరిగిన గ్రామ అభివృద్ధిని వివరించారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండలలో చెరువులు నిండు కుండలుగా తలపిస్తున్నాయని వివరించారు. ఎవ్వరైనా సరే సద్దితిన్న రేవు తలవాలని కోరారు. రూ.200 పింఛన్ రూ.2 వేలు చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోర్లు వేసినా నీళ్లు పడక బాధపడ్డారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో ఆ బాధ తప్పిందని, ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనదని మంత్రి హరీశ్ వెల్లడించారు. గతంలో బోరు బావులు తవ్వి డబ్బులు వృథా చేసుకున్నారని, ఇవాళ కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండించుకుంటున్నామని నాటి-నేటి పరిస్థితిని హ‌రీశ్‌రావు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్, ఎరువులు తదితర రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం తలపెట్టిన అంశాలు వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు