Saturday, July 27, 2024

ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా..

తప్పక చదవండి
  • అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే బలం..
  • రెండేళ్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నాకు అందుబాటులో లేరు..
  • మహిళలు సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావాలి : గవర్నర్ తమిళ సై..

హైదరాబాద్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తనకు అందుబాటులో లేరని వ్యాఖ్యానించారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని.. అలాగే అన్నింటినీ దాటగలుగుతున్నానని చెప్పుకొచ్చారు. ఆదివారం రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ.. పరిస్థితులను ఆస్వాదిస్తూ, తగినట్టు స్పందించడం ద్వారా పని భారం లేకుండా చేసుకోవచ్చని చెప్పారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. లైంగిక వేధింపులపై బాల్యం నుంచే ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయిస్తే ఆడపిల్లలు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు