Sunday, May 5, 2024

న్యూఢిల్లీ ఏఐసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు..

తప్పక చదవండి

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్‌ మేనేజ్‌మెంట్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు: 30.. పోస్టులు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు.. విభాగాలు: రూరల్‌ మేనేజ్‌మెంట్‌
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్‌) పీజీ డిప్లొమా (రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్)లో ఉత్తీర్ణత. వయసు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.60000.. ఎంపిక : ఆన్‌లైన్‌ పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.. పరీక్ష విధానం ‌: ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. పరీక్షలో రీజనింగ్‌, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ టెస్ట్‌పై ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌.. దరఖాస్తు ఫీజు: రూ.1000.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. చివరి తేది: జూలై 07.. వెబ్‌సైట్‌ : www.aicofindia.com

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు