Sunday, May 19, 2024

మాట ఇస్తే తప్పే మనిషిని కాదు..

తప్పక చదవండి
  • మభ్య పెట్టడం నా చరిత్రలో లేదు..
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై నా వంతు ప్రయత్నం చేస్తా..
  • మనఃపూర్తిగా మాట ఇచ్చిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..
  • జర్నలిస్టులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే ప్రసంగం..

ఆయన మాటల్లో వాస్తవం తొగిచూసింది.. జర్నలిస్టులపై ఆయనకున్న అవ్యాజమైన ప్రేమాభిమానాలు వెల్లివిరిశాయి.. తాను మాట ఇస్తే తప్పే మనిషిని కాదని మరోసారి ఆయన ప్రసంగంలో స్పష్టం అయ్యింది.. నేను ఉన్నాననే ఆయనిచ్చిన భరోసా జర్నలిస్టుల కళ్లల్లో వెలుగులు నింపాయి.. ఆప్యాయంగా పలుకరించి.. చిరునవ్వులు చిందిస్తూ.. ఆయన మాటలు కొండంత అండ మాకుంది.. అనే ధైర్యాన్ని జర్నలిస్టులకు అందించింది.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో, సాగిన జర్నలిస్టుల సమావేశం మరుపురాని మధురానుభూతిగా మిగిలిపోయింది..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తున్నానని, జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మార్డీసీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాట ముచ్చట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు అందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత మూడు నెలలుగా తాను జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా.. భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. తాను ఎప్పుడు అనవసరంగా మాట ఇచ్చి మభ్యపెట్టే వ్యక్తిని కాదని.. సాధ్యాసాధ్యాలు బేరీజువేసుకుని హామీ ఇస్తానని.. తనకు జర్నలిస్టులంటే అత్యంత గౌరవం ఉందని.. వారి సాధక బాధకాలు తెలుసని అన్నారు.. సోమవారం జరిగే మాట ముచ్చట కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబాలతో కలిసి.. తాను, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొంటానని హామీ ఇచ్చారు.. అపార్ధాలకు తావు లేకుండా.. పార్టీలకు అతీతంగా జర్నలిస్ట్ మిత్రులతో తాను ఎప్పుడూ సఖ్యంగా ఉంటానని.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు తన సాయ శక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు