Saturday, July 27, 2024

శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డా. బీ.ఎస్‌. రావు కన్నుమూత..

తప్పక చదవండి
  • బాత్‌ రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి గాయపడ్డ వైనం..
  • హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన రావు..
  • డా. బీ.ఎస్‌. రావు మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం..
    హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బీఎస్‌ రావు కన్ను మూశారు. బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడిన ఆయన తీవ్రంగా గాయ పడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు బీఎస్‌రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించారు.. అక్కడే అంత్యక్రియలు జరపనున్నారు. బీఎస్‌రావు పూర్తిపేరు బొప్పన సత్యనారాయణ రావు. శ్రీచైతన్య విద్యా సంస్థలను 1986లో ప్రారంభించారు. అనతికాలంలోనే సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు