Monday, May 6, 2024

“గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హానర్”​( ప్రధాని మోదీకి ఫ్రాన్స్​ అత్యున్నత పురస్కారం..)

తప్పక చదవండి
  • ఫ్రాన్స్ పర్యటనలో భారత ప్రధానికి ఘన స్వాగతం..
  • రెడ్ కార్పెట్‌పై మోదీ ఎంట్రీ
  • దేశంలో 2016లో యూపీఐ సేవలు ప్రారంభం
  • నేపాల్, భూటాన్, యూఏఈల్లోనూ చెల్లుబాటు
  • గతేడాది ఫ్రాన్స్, ఎన్సీపీఐ మధ్య ఒప్పందం

న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న మోదీని.. ఆ దేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ మేరకు “గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హానర్”​ను మోదీకి అందించారు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​. ఫ్రాన్స్​ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమమైనది. ఇక ఓ భారత ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి. ఎలిసీ ప్యాలెస్​లో గురువారం మోదీకి ప్రైవేట్​ డిన్నర్​ ఇచ్చారు మేక్రాన్​​. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “ఫ్రాన్స్​ దేశ ఆత్యున్నత పురస్కారమైన గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హైనర్​ను ప్రధాని మోదీకి ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​​ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్​​కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు,” అని భారత విదేశాంగశాఖ ట్వీట్​ చేసింది.
గతంలో కేవలం కొంతమంది ప్రముఖులకే ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్​ మండేలా, కింగ్​ ఛార్లెస్​, ఫ్రాన్స్​ మాజీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్, మాజీ యూఎన్​ ప్రధాన కార్యదర్శి బుట్రోస్​ బుట్రోస్​ ఘాలిలు ఈ జాబితాలో ఉన్నారు. 2023లో మోదీకి ఇప్పటికే నైల్​ ఆఫ్​ ఈజిప్ట్​, ఆర్డర్​ ఆప్​ పపువా గినియా, కంపానియన్​ ఆఫ్​ ఫిజీ, రిపబ్లిక్​ ఆఫ్​ పాలౌ నుంచి ఇబక్​ అవార్డ్​ వంటి అరుదైన పురస్కారాలు దక్కాయి. వీటితో పాటు మరెన్నో పురస్కారాలను గత కొన్నేళ్లలో మోదీ దక్కించుకున్నారు.
ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. గురువారం భారత సమాజంతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో యూపీఐపై కీలక విషాయన్ని వెల్లడించారు. “ఫ్రాన్స్​లో యూపీఐని వినియోగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రానున్న రోజుల్లో ఈఫిల్​ టవర్​ నుంచి యూపీఐ సేవలు ప్రారంభమవుతాయి. అంటే.. ఇక్కడ పర్యటనకు వచ్చే భారతీయులు.. ఇండియన్​ కరెన్సీలో డబ్బులు చెల్లించవచ్చు,” అని మోదీ అన్నారు. భూటాన్​, యూఏఈ, నేపాల్​లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులో ఉంది. అమెరికా, పశ్చిమాసియా, యూరోప్​లలోనూ యూపీఐ సేవలను విస్తరించాలని భారత దేశం భావిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు