గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి జీవితకాల శిక్షను విధించారు. వారణాసిలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. 32 ఏళ్ల క్రితం జరిగిన అవదేశ్ రాయ్ మర్డర్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ముక్తార్ అన్సారీ ఇప్పటికే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవదేశ్ రాయ్ను 1991, ఆగస్టు 3వ తేదీన కాల్చి చంపారు. వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి ముందు ఈ ఘటన జరిగింది. ఆ ఘటనలో అన్సారీతో పాటు ఇతరులపై కేసు బుక్ చేశారు. ఇదే కేసులో ముక్తార్ అన్సారీపై లక్ష జరిమానా వేశారు. అన్సారీపై 61 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను దోషిగా తేలడం ఇది అయిదోసారి. అతనిపై మరో 20 కేసులు విచారణ కోసం పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల ఏప్రిల్లోనే ఓ కిడ్నాప్-మర్డర్ కేసులో అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది.