Saturday, July 27, 2024

ప్రశాంత్ నీల్ కోసం నాటు కోడి పులుసు..

తప్పక చదవండి

‘కేజీఎఫ్’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ పరిశ్రమకు వెయ్యి కోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ఆదివారం ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఇక ప్రభాస్ సలార్ సెట్లో శనివారం అర్థ రాత్రి ప్రశాంత్ పుట్టన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్, తారక్ లు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ ను తెలియజేశారు. ఇక తారక్ ఏకంగా నాటు కోడి పులుసు పంపించి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే తారక్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు