Saturday, July 27, 2024

మంచినీళ్ల పండుగ ఎవరికోసం..?

తప్పక చదవండి
  • పేద ప్రజలకు అందని మంచినీళ్లు..
  • ఆవేదన వ్యక్తం చేసిన జి. లలిత, పల్లె మురళి ఎంసిపిఐ (యు) డివిజన్ నాయకులు..

హైదరాబాద్, మియాపూర్ డివిజన్ లో మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ఓంకార్ నగర్ లో 800 కుటుంబాలు బడుగు, బలహీన, అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు నీళ్ల సమస్య తీరలేదు.. ఇంత ఆధునిక ప్రపంచంలో ఉన్నా అనాగరికంగా గుంతలు, ఊట చలిమలు తొవ్వుకొని నీళ్ళు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచినీళ్ల పండుగ ఎవరికోసం..? పేదల సమస్యలు తీర్చలేనప్పుడు పండుగలు దేనికి..? ఈ పండుగలు ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు లాక్కోడానికేనా అని ప్రశ్నించారు ఏంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు పల్లె మురళి.. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ (యు) డివిజన్ నాయకులు శివాని రజియా, లలిత, బస్తీ వాసులు ఇసాక్, జంగయ్య, కోటయ్య, గాలయ్య, ఎల్లమ్మ, అనిత పాల్గొని ఓంకార్ నగర్ నీటి సమస్య పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు