తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో సుమారు రూ. కోటీ విలువ గల ఎర్రచందనం దుంగలను, పౌడర్ను పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు చంద్రగిరి మండలంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలను పొడిగా చేసి తరలించేందుకు యత్నిస్తున్న వాటిని పట్టుకున్నారు.. ఐదుగురు స్మగర్లును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద పొడి బ్యాగులు, రెండు కార్లు, లారీని స్వాధీనం చేసుకున్నారు. 25 కేసుల్లో నిందితుడిగా ఉన్న మహ్మద్ రసూల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.