Friday, March 29, 2024

కూతురుని 25 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి..

తప్పక చదవండి

భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పారిపోతున్న కూతుర్ని వెంబడించి మరీ 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో మే 18వ తేదీ జరిగిన ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూరత్‌ కడోదరాలోని సత్యనగర్‌ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో భార్యాపిల్లలతో కలిసి రామానుజా సాహూ అద్దెకు ఉంటున్నాడు. మే 18న రాత్రి 11:20 గంటల ప్రాంతంలో తన కూతురు టెర్రస్‌ మీద పడుకునే విషయంలో సాహూకి తన భార్య రేఖతో స్వల్ప వాగ్వాదం జరిగింది. చిన్న గొడవకే సాహూ ఆవేశంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి భార్యపై దాడికి దిగాడు. అది చూసిన పిల్లలు ఒక్కసారిగా భయపడిపోయారు. తల్లిని ఎలాగైనా రక్షించుకోవాలని తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పిల్లలు దగ్గరికి రావడంతో సాహూ మరింత రెచ్చిపోయాడు. తనను అడ్డుకునేందుకు వచ్చిన పిల్లలపై కూడా కత్తి విసిరాడు. వారిని వెంబడించి మరీ దాడికి దిగాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి పారిపోతున్న ఓ బాలిక అతనికి చిక్కింది. రూం దగ్గర కిందపడిపోయి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కన్నకూతురు కదా అని జాలి లేకుండా 17 సార్లు బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.

కూతుర్ని చచ్చేదాకా పొడిచినా సాహూ కోపం చల్లారలేదు. దీంతో తన నుంచి తప్పించుకుని పారిపోయిన భార్య రేఖ కోసం టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ ఆమెను కత్తితో పొడిచాడు. చేతివేళ్లను నరికేశాడు. కండ్ల ముందే కన్నతండ్రి చేస్తున్న మారణకాండను చూసి మిగిలిన పిల్లలు చలించిపోయారు. ఇప్పటికే తండ్రి చేతిలో సోదరిని కోల్పోయాం.. తల్లిని కూడా కోల్పోవద్దని తెగించారు. తండ్రి కత్తితో దాడి చేస్తున్నప్పటికీ ఎదురుతిరిగి అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాహోను అదుపులోకి తీసుకున్నారు. భార్య రేఖ ఫిర్యాదు మేరకు సాహూపై మర్డర్, అటెంప్ట్‌ టు మర్డర్‌ నేరాల కింద కేసు నమోదు చేసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు