Thursday, April 25, 2024

రైతుకు మద్దతు

తప్పక చదవండి
  • పెసరకు రూ. 803, వరికి రూ.143
  • రైతులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం
  • పలు పంటలకు మద్దతు ధర భారీగా పెంచుతూ నిర్ణయం
  • కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 202324 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెసర, వరి సహా వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వెల్లడిరచారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పెంచడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. 2023 2024 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఈ మద్దతు ధర పెంపు ఉంటుందని వెల్లడిరచారు.
మంచి నాణ్యమైన రకం గ్రేడ్‌ ఎ వరికి రూ.163లు పెంచినట్లు కేంద్రం వెల్లడిరచింది. ఈ పెంపు క్వింటాల్‌ గ్రేడ్‌ ఎ వరి ధర రూ.2203 కి పెరిగినట్లు పేర్కొంది. సాధారణ వరి రకాలకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.143 చొప్పున కేంద్రం పెంచింది. ఈ పెంపుతో సాధారణ వరి రకం క్వింటాల్‌ ధర రూ.2,183కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్‌ గోయల్‌ చెప్పారు.
ఈ పెంపులో అత్యధికంగా పెసర పంటకు కనీస మద్దతు ధరను భారీగా పెంచారు. క్వింటాల్‌కు రూ. 803 అదనంగా చెల్లించనున్నారు. గతేడాది క్వింటాల్‌ పెసర ధర రూ.7,755 లు ఉండేది. దాన్ని ఈసారి 10.4 శాతం పెంచారు. దీంతో క్వింటాల్‌ పెసరకు మద్దతు ధర రూ.8,558కి చేరింది. వీటితోపాటు హైబ్రిడ్‌ జొన్న క్వింటాల్‌కు రూ.3180 చెల్లించనున్నారు. జొన్న(మాల్దండి)కి రూ.3225.. రాగులు రూ.3846.. సజ్జలు రూ.2500కు పెరిగాయి. పొద్దుతిరుగుడు(గింజలు) రూ.6760, మొక్కజొన్న రూ.2090, సోయాబీన్‌ రూ.4600, వేరుశెనగ రూ.6377, పత్తి (మీడియం పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020 చొప్పున ఈ 2023 2024 సీజన్‌లో రైతులకు మద్దతు ధరగా చెల్లించనున్నట్లు కేంద్రం వెల్లడిరచింది. అలాగే, హైబ్రిడ్‌ జొన్న క్వింటాల్‌ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్‌ (పసుపు పచ్చ) రూ.4600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020చొప్పున ఈ సీజన్‌లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ 202324 మార్కెటింగ్‌ సీజన్‌కు ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు బుధవారం ఆమోదం తెలిపింది.
ఈ కేబినెట్‌ భేటీలో మణిపూర్‌ హింస, బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, మంత్రులందరూ సంతాపం తెలిపారని గోయల్‌ తెలిపారు. కనీస మద్దతు ధరతో పాటు హుడా సిటీ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌ లోని సైబర్‌ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 28.50 కిలోమీటర్ల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరు అయిన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.5452 కోట్లు.

ఎంఎస్‌పీ అంటే..

- Advertisement -

మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే రేటును ఎంఎస్‌పీ అంటారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ఇది రైతులకు హామీగా, మరింత ఆహారాన్ని పండిరచడానికి వారికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు