Saturday, July 27, 2024

మాజీ సైనికుల సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి..

తప్పక చదవండి

జనగామ: మాజీ సైనికుల సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా జనగామకు చెందిన కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని అమృతవాణి ఫంక్షన్ హాల్ లో కెప్టెన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల జనరల్ బాడీ‌ సమావేశంలో నూతనంగా
రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతిని ఎన్నుకున్నారు. మాచర్ల బిక్షపతిని మాజీ సైనికులు శాలువాగప్పి ఘనంగా సన్మానించారు.ఈ క్రమంలో తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు మాజీ సైనికులకు కృషికి ఎల్లప్పుడూ తోడ్పడుతానని, ఈ బాధ్యత ద్వారా మరొక మారు సైనికులకు సేవ చేసుకునే అవకాశం దక్కిందని కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి అన్నారు. మాజీ సైనికులందరికి కృతజ్ఞతలు సైనిక వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దండ్యాల కరుణాకర్ రెడ్డి, జనగామ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మెంబర్ గా ప్రవీణ్ కుమార్, వీరి ముగ్గురు జనగామ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు