Friday, May 17, 2024

మంత్రి విడదల రజినిపై ఫైర్ అయిన ప్రత్తిపాటి..

తప్పక చదవండి
  • సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి..

పసుమర్రులో తాగునీటి పైపులైన్‌ పనులపై మాజీ మంత్రి ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలంటూ మంత్రి విడదల రజినికి సవాల్ విసిరారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ‘‘తాగునీటి పైపులైన్‌ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్‌ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే. చిలకలూరిపేటలో మద్యం షాపులన్ని మంత్రి ఆధీనంలోనే ఉన్నాయి. 6 వేల ఎకరాలకు నీరిచ్చే 2 ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేశారు. మంత్రి రజిని అసమర్థతతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చిలకలూరిపేటకు ఈ దుస్థితి ఎందుకు తెచ్చారో రజిని చెప్పాలి.’’ అని పుల్లారావు డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు