Sunday, April 28, 2024

కృష్ణా జలాల వాటాలో తీరని అన్యాయం..

తప్పక చదవండి

కాంగ్రెస్‌ స్వార్థపూరిత రాజకీయం ఉమ్మడి పాలమూరుకు శాపంగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం నడిగడ్డను నట్టేట ముంచుతున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89తో రాష్ర్టానికి ఒరిగేది శూన్యమంటూ ఆది నుంచీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనే నిజమని తేలింది. కృష్ణా జలాల పంపిణీపై ఇటీవల విచారించిన ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ కూడా ఈ విషయన్ని తేల్చి చెప్పారు. ఫలితంగాకృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 ఒక్కటే ఇప్పుడు దిక్కైంది. ఏపీ పునర్విభవజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం కృష్ణా, గోదావరి జలాలను కేవలం ప్రాజెక్టుల వారీగానే పంపిణీ చేయాలని మాత్రమే అప్పటి యూపీఏ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. అలా చేస్తే తమకు ఒరిగేదీ ఏమీ ఉండదని, పరీవాహాక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలను తేల్చాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టికి కేసీఆర్‌ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్‌ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై 14న వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవచ్చని న్యాయశాఖ చెబుతున్నా కేంద్రమాత్రం కాలయాపన చేస్తూ వచ్చింది. ఏడాది వేచి చూసినా ఫలితం లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరుగుతుండగానే న్యాయశాఖ సలహాతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నవంబరు 17, 2015లో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ మూడు వారాల్లోపే మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోని కేంద్రం చివరికి 6 అక్టోబర్‌ 2020లో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించినా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని షరతు పెట్టింది. సరేనన్న ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుని రెండేళ్లు కావస్తున్నా కేంద్రం నుంచి ఇప్పటికీ ఉలుకుపలుకూ లేకుండా పోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు