Saturday, July 27, 2024

రాహుల్ ట్వీట్ అవమానకరం..

తప్పక చదవండి
  • విరుచుకుపడ్డ టి. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
  • దేశ భద్రత విషయాలను రాజకీయాల్లోకి లాగడం తగదు..
  • మణిపూర్ మండుతోంది.. అంటూ ట్వీట్ చేసిన రాహుల్..
  • కాంగ్రెస్ పార్టీకి భారత ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు.. : కిషన్ రెడ్డి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. దౌత్య సంబంధాలు, పరస్పర సహకారం, ఆర్థిక రంగంతోపాటు.. పలు అంశాల గురించి ఆయా దేశాల సారథులతో చర్చించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘మణిపూర్ మండుతోంది. ఈయూ పార్లమెంట్ భారతదేశ అంతర్గత విషయాలను చర్చిస్తుంది. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా అనలేదు! ఇంతలో, రాఫెల్ బాస్టిల్ డే పరేడ్‌కి టిక్కెట్‌ను పొందింది..’’ అంటూ రాహుల్ ప్రధాని పర్యటనను ఉద్దేశిస్తూ వ్యంగంగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ ఈ విధంగా ట్విట్ చేయడం.. అవమానకరం.. సిగ్గుచేటన్నారు. దేశ భద్రత విషయాలను ఇలాగా రాజకీయాలలోకి లాగడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు..

కిషన్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘‘నిజంగా అవమానకరమైన ట్వీట్.. భారతదేశ అంతర్గత విషయాలను బయటి వ్యక్తులు వ్యాఖ్యానించకూడదని ఒకే గొంతుతో మాట్లాడే బదులు.. రాహుల్ గాంధీ విదేశీ సంస్థల వలే వ్యాఖ్యానించడానికి ఇష్టపడతారు.. దానిని ఆనందంగా జరుపుకుంటారు. రాజకీయ అంశాల కోసం దేశ రక్షణ భద్రతను లాగడం మరింత సిగ్గుచేటు. ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి భారతదేశ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ది ఉందా..?’’.. అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ లో రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు