Monday, April 29, 2024

నడ్డాతో బండి భేటీ..

తప్పక చదవండి
  • జాతీయ పదవిపై కృతజ్ఞతలు..

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సోమవారం భేటీ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు జేపీకి బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు. పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్‌ అగర్వాల్‌తో కలిసి 15 నిమిషాల పాటు నడ్డాతో బండి సమావేశమయ్యారు. జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈసందర్భంగా బండి వెల్లడించారు.. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. బీజేపీ హైకమాండ్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు