Friday, May 3, 2024

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

తప్పక చదవండి

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపరీక్ష ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో 76.32 శాతం, వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ పరీక్షకు 3,38,739 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.15 లక్షల మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24, 724 మంది పరీక్ష రాయగా.. 1,71, 514 మంది అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 90,573 మంది పరీక్ష రాయగా.. 81,203 మంది అర్హత సాధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు