ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జమ్ముకశ్మీర్కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియామకమయ్యారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు. ఈ యేడాది ఫిబ్రవరి 9న మణిపూర్ హైకోర్టు సీజేగా నియమిస్తు పేరును ప్రతిపాదించగా కేంద్రం ఇంకా ఆమోదం తెలుపులేదు. ఈ దశలో ఆ సిఫార్సును రద్దు చేస్తూ ధీరజ్సింగ్ ఠాకూర్ను ఏపీ సీజేగా సిఫారుసు చేస్తూ కేంద్రం ఆమోదానికి పంపింది. కేంద్రంఈ సిఫారుసుకు ఆమోదం తెలుపవలసి ఉంది.