కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
శామీర్పేట : అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం శామీర్పేట మండల కార్యాలయం వద్ద అంబేడ్కర్ భవణ నిర్మాణ పనులకు రూ.10 లక్షలతో భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన బాటలో ప్రగతికి బాటలు వేయాలన్నారు. అంబేడ్కర్ స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సేన మండల అధ్యక్షులు వజ్జల మురళి, ఉపాధ్యా యులు బిక్షపతి, రాజు, డేవిడ్, ప్రధాన కార్య దర్శి బాలేష్, సాయికుమార్, వెంకటేష్, ప్రచార కార్యదర్శులు శ్రీకాంత్, శ్రీనివాస్, కోశాధికారి ఆంజనేయులు, పరశురామ్, వీరేష్, శామ్, కాళి దాస్, బాబు, వెంకటేష్, ఆనంద్, పోచయ్య, కృష్ణ, యాదగిరి, గ్రంధాలయ ఛైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, ఎంపిపి ఎల్లుబాయి బాబు, జెట్పిటిసి అనిత లాలయ్య, వైస్ ఎంపీపీ సుజా త, జడ్పీ కో ఆప్షన్ జహీర్, రైతు బంధు అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీడీఓ వాణి శామీర్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విలసా గరం సుదర్శన్, గ్రామాల సర్పంచ్ లు, ఎంపి టిసిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.