జీవితంలో అందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారే స్నేహితులు. కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాన్నీ ఫ్రెండ్స్కు చెప్పుకుంటాం. స్నేహితుల మధ్య నువ్వు- నేను అనే తేడాలు ఉండవు. స్నేహితులు అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, కాగా నేడు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు సంబరాల్లో మునిగితేలారు. వారికి ఇష్టమైన స్నేహితులను కలుస్తూ.. విషెస్ చెప్పుకుంటున్నారు. ఇక స్నేహితుల దినోత్సవం సందర్భంగా జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ డెలివరీ ఏజెంట్ అవతారమెత్తారు. ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని తన కంపెనీ డెలివరీ పార్టనర్లు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు ఫుడ్తో పాటు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను గిప్ట్గా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఫ్రెండ్షిప్ డే రోజున మా డెలివరీ పార్టనర్లు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు కొంచెం ఫుడ్.. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్లను డెలివరీ చేయబోతున్న.. ఈ ఆదివారాన్ని మర్చిపోలేను” అంటూ ఫొటోలతో కూడిన పోస్ట్ను గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.