Saturday, April 27, 2024

బెంగళూరు బెల్‌లో 205 ఇంజినీర్‌ పోస్టులు..

తప్పక చదవండి

ఐటీ, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర పోస్టుల భ‌ర్తీకి బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 24వ‌ తేదీతో ముగియనుంది. మొత్తం 205 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు : 205.. పోస్టులు : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌.. అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. దరఖాస్తు ఫీజు: 1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: రూ.472.. 2. ట్రెయినీ ఇంజినీర్‌: రూ.177. జీతం : రూ.30000 నుంచి రూ.55000.. వ‌య‌స్సు : పోస్టుల‌ను బ‌ట్టి 28 నుంచి 32 ఏండ్లు మించ‌కుడ‌దు.. చివరితేదీ: జూన్ 24.. వెబ్‌సైట్‌: https://www.bel-india.in/.. అడ్ర‌స్ : ఔటర్ రింగ్ రోడ్, నాగవర బెంగళూరు: 560045 కర్ణాటక, భారతదేశం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు