- ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు.
- ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లి ఫాతిమా, కూతురు గౌస్యలు ఆదివారం సాయంత్రం బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించిన రొట్టెల పండుగకు వచ్చారు. నెల్లూరు రైల్వే వంతెన వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా మదురై-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ వీరిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
తప్పక చదవండి
-Advertisement-