Saturday, May 18, 2024

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్..

తప్పక చదవండి
  • రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్

బిసి విద్యార్థుల కోసం నూతనంగా మరొక 17 డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాప్రదాతగా చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఆర్థికంగా వెనుకబడిన (EWS) విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పం తో ప్రతి ఏడాది అన్ని రకాల గురుకుల పాఠశాలను దశలవారీగా పెంచుతూ పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాలల వరకు నూతన గురుకుల ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు ఉంటే నేడున 327 గురుకులాలకు చేరుకోవడం జరిగిందని. దీనిలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఉచితంగా పొందుతున్నారని అన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి గురుకుల విద్యా విధానం లేదని కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకే ఇది సాధ్యమైందని అన్నారు.
కళాశాలలో ఫీజులు కట్టలేక, రూమ్ కిరాయిలు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ డిగ్రీ కళాశాలలతో ఎంతో మేలు జరుగుతుంది అని దీనివల్ల వారు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడడానికి దోహదపడుతుంది అని అన్నారు.

ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి విద్యార్థులు అందరూ జీవితాంతం రుణపడి ఉంటారు అని అన్నారు.
బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కిశోర్ గౌడ్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు