Saturday, July 27, 2024

ఆహార పొట్లాలు, మజ్జిగ, మంచినీళ్ల వితరణ..

తప్పక చదవండి
  • శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
  • ఆషాఢ మాసం భోజనాల సందర్భంగా ఈ కార్యక్రమం
    చేపట్టామని తెలిపిన పాలపర్తి సంధ్యారాణి..

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మంగళవారం నాడు గాంధీ హాస్పిటల్ వద్ద 55 మంది పేదలకు ఆహార పొట్లాలు, మజ్జిగ, మంచినీళ్లు వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి అందించడం జరిగింది. ప్రతి నెల దాదాపు ఆహారం కానీ, అల్పాహారం కానీ తమ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని, ఎవరైనా ఆకలి మీద ఉన్నప్పుడు వారి ఆకలి తీర్చటం మన కనీస కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, అన్నపూర్ణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు