- 19 మంది ప్రయాణికులను దించేసిన విమాన సిబ్బంది..
- ప్రతికూల వాతావరణం, అధిక బరువే కారణం..
- రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఈజీజెట్..
- స్పెయిన్ నుండి బ్రిటన్ వెళ్లాల్సిన విమానంలో ఘటన..
- విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్న ప్రయాణికులు..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. బరువైన విమానం టేకాఫ్ కు కష్టంగా మారడంతో ఆ విమానం నుండి 19 మంది ప్రయాణికులను దింపివేసిన సంఘటన స్పెయిన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన షెడ్యూల్ దాటిపోయింది. విమానం టేకాఫ్ కోసం పైలట్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులను దింపేశారు. స్పెయిన్లోని లాంట్రోజ్ విమానాశ్రయంలో ఈ విచిత్ర అనుభవం ఎదురైంది.
బ్రిటన్కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఈజీ జెట్ విమానం స్పెయిన్ నుంచి బ్రిటన్కు ప్రయాణించాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఆ విమానం గాల్లోకి ఎగరాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ విమానం ఆలస్యమైంది. అయితే విమానం టేకాఫ్ కావాల్సిన సమయం మించిపోవడంతో పైలట్లు ఎలాగైనా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చేసేదేమీ లేక పైలట్లు కొందరు ప్రయాణికులను దిగి పొమ్మని సూచించారు. ప్రతికూల వాతావరణం ఉండటం, విమానంలో అధిక బరువు ఉండటంతో టేకాఫ్ కష్టంగా మారిందని పైలట్లు పేర్కొన్నట్లు అందులోని ప్రయాణికులు చెప్పారు. స్పెయిన్లోని లాంజ్రోట్ ఎయిర్పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం టేకాఫ్ కాకపోవడానికి గల కారణాన్ని ఈజీ జెట్ పైలట్, సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులకు చెప్పారు. ప్రతికూల వాతావరణం, విమానం బరువుతోపాటు లాంజ్రోట్ ఎయిర్పోర్టు రన్వే పొడవు కూడా తక్కువగా ఉండడం వల్ల టేకాఫ్ కష్టమవుతోందని విమాన సిబ్బంది ప్రయాణికులకు వివరించారు.
ఈ పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని విరమించుకుని.. దిగిపోతేనే విమానంటేకాఫ్ అవుతుందని చివరికి పైలట్ తేల్చి చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులైనా విమానం దిగి.. తర్వాతి రోజు ప్రయాణించాలని కోరాడు. అలా చేసిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని ఈజీ జెట్ సంస్థ ప్రకటించింది. ఒక్కొక్కరికీ 500 పౌండ్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్క ప్రయాణికుడూ ముందుకు రాలేదు. చివరికి ఈజీ జెట్ సంస్థ 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి తర్వాతి దింపేసింది. వారి కోసం మరో విమానం ఏర్పాటు చేసి సాధారణ సమయాని కంటే రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.