Monday, May 6, 2024

సిద్దిపేట జిల్లా యాదవ యువత అధ్యక్షులుగా బొల్లు రాము యాదవ్ నియామకం..

తప్పక చదవండి

అఖిల భారత యాదవ యువ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా.. సిద్దిపేట పట్టణానికి చెందిన చురుకైన, విద్యా వంతుడైన సామాజిక సేవకుడు బొల్లు రాము యాదవ్ ని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు, జాతీయ ప్రధానకార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్ ల మార్గ దర్శకత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ ల సమక్షంలో రాష్ట్ర యువత అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.

బొల్లు రాము యాదవ్ అనేక సంవత్సరాలనుండి ఉమ్మడి మెదక్ జిల్లా మురళి యాదవ్, పయ్యావుల రాములు యాదవ్ లతో పాటు ప్రస్తుత సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ ల నాయకత్వంలో జరిగిన పలుకార్యక్రమాల్లో చురుకుగా, క్రియాశీలంగా పాల్గొన్నారని, అందుకే వారి సేవలు భవిష్యత్తులో మరింత సంఘానికి ఉపయోగపడాలని ఈ బాధ్యతలను అప్పగించామన్నారు. ఈ సందర్బంగా బొల్లు రాము యాదవ్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.. అంకితబావం, చిత్తశుద్ధితో యాదవ యువతకు, జాతికి, సేవచేసి మీ గౌరవాన్ని, సంఘం గౌరవాన్ని నిలబెడుతానని, అందరినీ కలుపుకొని ముందువెలుతానన్నారు.. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు గండి మల్లేష్ యాదవ్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెరుగు అయిలేష్ యాదవ్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పాతుకుల వెంకటేష్ యాదవ్, ఉపాధ్యక్షులు జక్కుల బాలమల్లు యాదవ్, ఐతం రాజుయాదవ్, బూరం గణేష్ యాదవ్, సిద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నూనె కుమార్ యాదవ్, కార్యదర్శులు పత్తివెంకటేష్ యాదవ్, గొల్ల రాజేశ్వర్ యాదవ్, ఎద్దు యాదగిరి యాదవ్, పెరబోయిన శ్రీకాంత్ యాదవ్, బొల్లు తిరుపతి యాదవ్, రాజబోయిన పర్శరాములు, తెలుజీరు శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, తగరం అశోక్ యాదవ్, కాటుక నర్సింలు యాదవ్ లతో పాటు, మండలాల అధ్యక్షులు మేకల శ్రీకాంత్ యాదవ్ బెజ్జంకి, కన్నబోయినరాజు యాదవ్ చిన్నకోడూరు, వొడితం కిరణ్ యాదవ్ నంగునూర్, రాజబోయిన కొమురయ్య యాదవ్ మర్కుక్, యాంజాల అయిలేష్ యాదవ్ ములుగు, కన్నాయాదవ్ గజ్వేల్, సిద్దిపేట రూరల్ ఉడుత రవి యాదవ్, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్, దాసరి శ్రీనివాస్ యాదవ్ రాగారం రాము యాదవ్, తెలుజీరి నాగరాజు యాదవ్, రాగారం శ్రీనివాస్ యాదవ్ తదితరులుపాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు