మధ్యప్రదేశ్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేశారు. ఆవుతో శృంగారం చేసిన కేసులో భోపాల్కు చెందిన అతనిపై ఇవాళ కేసు పెట్టారు. అసహజమైన రీతిలో ఆవుతో సెక్స్ చేసినట్లు ఆ వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. హనుమాన్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనను ఖండించిన హిందుత్వవాదులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై ఐపీసీ 377(అసహజ శృంగారం) కింద కేసు బుక్ చేశారు. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ ఘటనను ఖండించారు. భూమిని తల్లిగా ఆరాధిస్తామని, అలాగే ఆవులను కూడా తల్లిగా భావిస్తామని, ఇలాంటి అసహజ ప్రక్రియలు కరెక్టు కాదన్నారు. అయితే ఇప్పటి వరకు నిందితుడిని గుర్తించలేదు. మరో 24 గంటల్లో అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.