Saturday, July 27, 2024

ప్రాచీన గ్రంథాలను పరిరక్షించాలి..

తప్పక చదవండి

చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. నేను నా భార్య బిడ్డల కన్నా పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను. ‘‘పుస్తకాలు దీపాల వంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలిగిస్తుంది’’… భారత రత్న ప్రపంచ మేధావి అంబేద్కర్‌ మాటలు మనకు నిత్య జ్ఞాపకాలే. పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆనందాన్నిస్తుంది, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలవాట్లను మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధిగా, జ్ఞానాన్ని పంచే మాధ్యమంగా పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం. కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్‌, మొబైల్‌ ఇతరములు ఎన్ని దరిజేరుతున్నా. పుస్తకం విలువ మాత్రం చెక్కుచెదర లేదు. మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహద పడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞాన సముపార్జన తృష్ణ మొదలైంది అంటే, తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య నూతన విజ్ఞానాన్ని అందించేది పుస్తకం. అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మానవుని భావనా తరంగాలు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలం లోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి ఆయు ప్రమాణం వందేళ్ళయితే, గ్రంథ ఆయు ప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంథ పూజను పుస్తకాల (సర స్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రు లలో నిర్వహించే ఆచారం కొనసాగు తున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్ళకు అద్దుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది. గ్రంథానికి వయసు అనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటిల్యుడు అర్థశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్యశాస్త్రం హాలుని ‘’గాథా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యా కాశాన ధ్వజాల లాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తు న్నాయి. భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంథాలు విదేశీయులను ఆకర్షిం చాయి. అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా, భారత దేశాన్ని జయిం చడానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన అరిస్టాటిల్‌ మన దేశ తత్వ సాహిత్యాన్ని తిరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికుల సందర్శనలకు హేతువులై నాయి. చైనా, టిబెట్‌, అఫ్ఘనిస్థాన్‌, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసుకెళ్ళారు. అక్షరం కనుగొన బడడానికి ముం దు వేద వ్మాయం శృత సాహిత్యంగా ఉండేది. శృతం లిఖితం కావడం మానవ సంస్కృతీ వికాస పరిణామాల క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రస్తాన త్రయం, భారత, భాగవత, రామాయణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంథాలు, భారతీయ కథా సాహిత్యం గ్రంథ రూపం సంతరించు కున్నాక, ప్రపంచంలో ఏజాతీ, ఏదేశం, భారత దేశానికి సాటి రావని సర్వ ప్రపంచానికి ద్యోతక మైంది. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు నలంద, తక్షశిల తది తర విశ్వ విద్యాలయాలలో భద్రపరచ బడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్‌ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదులు దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విశాద ఘటన. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతులు ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధ మయ్యే సౌలభ్యం ఏర్పడిరది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండే వారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహు కష్టంతో కూడుకునేది. గ్రంథస్థ విషయాలు ప్రపంచ మంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంథాలు, సృజనాత్మక సాహితీ గ్రంధాలు, ఆధ్యాత్మి కాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసి, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకుని చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివే విధంగా వారికి గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజిన్‌ లు కూడా ఇవ్వాలని, వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని వివరించారు. అన్ని పాఠశాలల్లో 10 జూలై నుండి 15 జులై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లో పఠనోత్సవాలను నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. పఠనం అభ్యాసం కోసం కాల నిర్ణయ పట్టికలో ప్రత్యేక సమయం కేటాయించడం, పఠనాసక్తిని పెంపొందించే కృషి జరగడంహర్షణీయం. అలాగే అపూర్వ, అపురూప, అమూల్య ప్రాచీన గ్రంథాల పరిరక్షణ పట్ల బాల్యం నుండే పిల్లలలో అవగాహన కల్పించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
రామ కిష్టయ్య సంగన భట్ల..
9440595494

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు