Friday, April 19, 2024

ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు..

తప్పక చదవండి

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును ఆపి, ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఈ ప్ర‌మాదంలో క్ష‌ణాల్లో బ‌స్సు పూర్తిగా కాలిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. కూక‌ట్‌ప‌ల్లి నుంచి బాలాన‌గ‌ర్ వైపు బ‌స్సు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. బ‌స్సులో మంట‌లు చెల‌రేగ‌డంతో ఆ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు