Friday, May 17, 2024

పలువురు పేద విద్యార్థులకు కడియం ఫౌండేషన్ చేయూత..

తప్పక చదవండి

పేద కుటుంబాల్లో సరస్వతి కటాక్షంతో జన్మించిన విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం అందించాలని కడియం ఫౌండేషన్ ని కోరగా…. తమ వంతు సహాయంగా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయాన్ని అందించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని కూనూరు గ్రామానికి చెందిన ఇల్లందుల భీమయ్య కొడుకు వంశి యం.బి.బి.ఎస్ చదువుకు.. స్టేషన్ ఘనపూర్ గ్రామానికి చెందిన నీరతి ప్రభాకర్ కూతురు నీరటి సాయిశ్రీ బి.ఎస్.సి నర్సింగ్ చదువుకు.. రాజవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి మనుమరాలు, రాసమల్ల కృష్ణవేణి పాలిటెక్నిక్ డిప్లొమా చదువుకు.. క్యాతంపల్లి గ్రామానికి చెందిన గంగారపు సంజీవ కూతురు, సురక్షిత యం.బి.బి.ఎస్ చదువుకు.. కడియం శ్రీహరి తన నివాసం నందు ఆర్థిక సహాయాన్ని అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు