డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), ఐఐటీ బాంబే సంయుక్తాధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ పేరిట జూలై 9న ఘట్కేసర్లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో దేశంలోని 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000 పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. దీంతో పాటు ఇంజినీరింగ్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు టెక్నికల్, ఫండమెంట్ స్కిల్స్ పెంపొందించేలా ‘స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు’(Spoken tutorial project) పేరిట ట్రెయినింగ్ ఇస్తారు. ఈ ట్రెయినింగ్లో వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ జాబ్ మేళాలో ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చు.