Friday, May 17, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ చైర్మన్
    దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్..

హైదరాబాద్, 27 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బీ.ఆర్.ఎస్.వీ. ఆధ్వర్యంలో తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలు వద్దు సేవా కార్యక్రమాలు ముద్దు అని ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బీ.ఆర్.ఎస్.వీ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పేద విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ అందజేయడం జరిగింది.

అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మూడు మొక్కలు నాటి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్.వీ. రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, జంగం అవినాష్, చటారి దశరథ, జంగయ్య, రమేష్, రవి నాయక్, సిగం వెంకటేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు