Saturday, July 27, 2024

సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి..

తప్పక చదవండి
  • కితాబిచ్చిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్..

జనగామ నియోజకవర్గం, జనగామ మండలం, పెద్దరాంచెర్ల గ్రామానికి చెందిన వంగ రమాదేవి అనారోగ్యంతో వైద్యానికి ఖర్చు కాగా, ఇట్టి విషయం బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి రాగా, వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ నిధి నుండి 60,000 రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. ఇట్టి మంజూరైన చెక్కును బాధితురాలి భర్త వంగ తిరుపతికి వారి గ్రామంలో కిరణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలి భర్త మాట్లాడుతూ సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కును మంజూరు చేయించిన నాగపురి కిరణ్ కుమార్ కి అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు….ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షులు కళ్లెపు రాజు, మాజీ ఉపసర్పంచ్ మల్లెపుమల్లేశం, బచ్చన్నపేట పీ.ఏ.సి.ఎస్. డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్,నాగేందరరెడ్డి, నాని బాబు, కలువ భాస్కర్, శివరాత్రి నాగరాజు, కళ్లెపు కిష్టయ్య, శ్రీనివాస్, ఎండి మున్నా, సాయి కళ్లేపు, ఉదయ్ కుమార్, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు