Thursday, May 16, 2024

గ్రాండ్‌ విటారా ధర పెంపు..

తప్పక చదవండి
  • కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్..
    గ్రాండ్‌ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ వేరియంట్లలో పెడెస్ట్రియన్‌ సేఫ్టీ వెహికిల్‌ అలారం (ఏవీఏఎస్‌)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్‌ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.. ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ వెల్లడించింది. ఈ నయా టెక్నాలజీతో ప్రమాదాలు మరింత తగ్గగలవన్న ఆశాభావాన్ని కంపెనీ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.18.29-19.79 లక్షలుగా ఉన్నది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు